Rashmika Mandanna: ‘కింగ్డమ్‌’పై ర‌ష్మిక పోస్ట్.. రిప్లై ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్‌డమ్(Kingdom)’ చిత్రం నిన్న (జులై 31) విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్, 1990ల శ్రీలంక నేపథ్యంలో సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంపై నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్(Emotional post) పెట్టింది. “ఈ విజయం నీకు, నిన్ను ప్రేమించే వారికి ఎంత ముఖ్యమో నాకు తెలుసు @thedeverakonda ! ‘మనం కొట్టినం’ #Kingdom,” అంటూ రష్మిక రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లవ్ ప్రపోజ్ చేయాలని కామెంట్స్

విజయ్ దేవరకొండ కూడా రష్మిక పోస్ట్‌కు స్పందిస్తూ, “మనం కొట్టినం!” అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఈ హ్యాపీ మూమెంట్‌లో రష్మికకు విజయ్ లవ్ ప్రపోజ్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ టీట్లతో వారి మధ్య సన్నిహిత సంబంధం గురించిన చర్చలు మరోసారి ఊపందుకున్నాయి.

Liger: Rashmika Mandanna to do an item number in Vijay Deverakonda's film?

మీ ప్రేమ, వెంకన్న స్వామి ఆశీస్సుల వల్లే: విజయ్

‘కింగ్‌డమ్’ చిత్రం విజయ్ కెరీర్‌లో కీలకమైనదిగా నిలిచింది. గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ సినిమాతో విజయ్ బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్‌(Success Celebrations)లో విజయ్ మాట్లాడుతూ “ఈ సక్సెస్ మీ ప్రేమ, వెంకన్న స్వామి ఆశీస్సుల వల్లే సాధ్యమైంది” అని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్(Satyadev), వెంకిటేష్‌లు కీలక పాత్రల్లో నటించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *