Ashwin: నా కొడుకు ఇంకెంతకాలం సహించగడు.. అశ్విన్​ తండ్రి సంచలన వ్యాఖ్యలు

భారత స్పిన్​ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టే తన కెరీర్‌లో చివరిద అని బుధవారం ప్రకటించాడు. మంచి ఫామ్‌తోపాటు ఫిట్‌నెస్, ఇంకొన్నేళ్ల పాటు ఆడే సత్తా ఉన్నా అతడు హఠాత్తుగా (Ashwin retirement) రిటైర్​మెంట్‌ ప్రకటించడం ఒక్కసారిగా క్రికెట్​ వర్గాలను షాక్​కు గురిచేసింది. అయితే జట్టులో ఉన్న అంతర్గత కారణాలు, ఒత్తిడి కారణంగానే అతడు రిటైర్మెంట్​ ప్రకటించి ఉంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అశ్విన్ ((Ashwin Father)​ తండ్రి రవిచంద్రన్​ షాకింగ్స్​ కామెంట్స్​ చేశారు. వేధించడంతోనే తన కుమారుడు టీమ్ నుంచి తప్పుకున్నాడని అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రన్​ మాట్లాడుతూ.. అశ్విన్ రిటైర్మెంట్‌కు చాలా కారణాలు ఉండొచ్చునని, అవి ఏంటనేది కేవలం అతడికే తెలియాలి అని అన్నారు. తన కొడుకుని టార్చర్ పెట్టారని.. ఇంకా ఎన్నేండ్లు వేధింపులు సహించాలనే ఫ్రస్ట్రేషన్‌లోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కొడుకును చాలా కాలంగా హింసిస్తున్నారు. అతడు రిటైర్మెంట్ తీసుకుంటాడనే భయం నాకు కూడా ఉంది. ఇప్పుడు అదే నిజమైంది. వేధింపులు ఇంకెంతకాలం సహించగలడు. వాటిని తట్టుకోలేకే అతడు ఈ నిర్ణయానికి వచ్చాడు’ అని అన్నారు. అయితే అశ్విన్‌ను వేధించిది ఎవరు? టీమ్ మేనేజ్‌మెంటా లేక సహచర ఆటగాళ్లా? మరెవరైనా అనేది మాత్రం రవిచంద్రన్ బయటపెట్టలేదు.

‘అశ్విన్ రిటైర్​మెంట్ గురించి నాకు ఆలస్యంగా తెలిసింది. అతడి మైండ్‌లో ఏం నడుస్తోందో నాకూ తెలియదు. రిటైర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ అతడి నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పదు. ఎంతో ఒత్తిడి కారణంగా నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇందుకు నేనేమీ బాధపడటం లేదు. అతడు రిటైర్​మెంట్ గురించి అతడు ప్రకటించిన తీరు ఒకింత సంతోషం కలిగించినా.. ఎక్కువగా బాధకు గురిచేసింది. ఎందుకంటే ఇంకొన్నాళ్లపాటు ఆటలో కొనసాగాల్సింది. ఎక్కడో ఏదో జరిగింది’ రవిచంద్రన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్​ వర్గాల్లో దుమారం రేపాయి.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *