SLBC టన్నెల్ ప్రమాదం.. ఆ ఏడురురి ఆచూకీ ఇక దొరకనట్టేనా?

శ్రీశైలం ఎడమగట్టు SLBC టన్నెల్ ప్రమాదం(Tunnel Accident) జరిగి నేటికి 28 రోజులు గడిచిపోయాయి. కానీ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిలో ఇప్పటికి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. ఇంకా ఏడుగురు కార్మికుల(Workers) కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ల ఎండ్ పాయింట్ వరకు రెస్క్యూ సిబ్బంది వెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకపోవడంతో, తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth) ఆదేశాల మేరకు చెన్నై(Chennai)కి చెందిన IIIT రోబోలను రంగంలోకి దించారు.

Slbc Tunnel Accident Update: కొనసాగుతున్న సహాయ చర్యలు..ఆ 8 మందిపై రేపు  సాయంత్రానికి క్లారిటీ ? | Search operation underway for 8 people trapped in  SLBC tunnel accident in Nagarkurnool district

భారీ ఊటతో సహాయక చర్యలకు ఆటంకం

వీటి ద్వారా మనుషులు వెళ్లలేని ఎండ్ పాయింట్లో రోబో(Robo)ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని అంతా భావించినప్పటికీ, టన్నెల్ లో నెట్వర్క్ సిగ్నల్(Network Signal) సరిగా లేకపోవడంతో రోబోలతో చేసే సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్(Cadaver Dogs) గుర్తించిన అనుమానిత ప్రదేశాలను D1, D2 పాయింట్లుగా మార్కింగ్ చేసుకుని ఆ ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టారు. మొదట D1 పాయింట్ లో తవ్వకాలు చేపట్టిన సిబ్బంది 8 మీటర్ల లోపలి వరకు తవ్వినా ఎలాంటి ఫలితం దక్కలేదు. పైగా భారీ దుర్వాసన వస్తుండడం, మృతదేహాలు ఆ చుట్టుపక్కలే ఉంటాయన్న అనుమానంతో మరోసారి క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు చేపట్టి D2 పాయింట్‌లో ముమ్మరంగా తవ్వకాలు చేపడుతున్నారు. కానీ ఆ ప్రదేశంలో భారీగా ఊట నీరు వస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

SLBC Tunnel Recue operation: కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్  - Telugu News | SLBC Tunnel Rescue Operation Reaches Crucial Stage | TV9  Telugu

కుటుంబీకుల ఆందోళన

కాగా గతనెల 22న నాగర్ కర్నూల్ జిల్లాలో SLBC టన్నెల్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ ఇంజినీర్‌(Engineer)తోపాటు మరో ఏడుగురు కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో ఇంజినీర్ మృతదేహం లభ్యమైంది. మిగతా వారికోసం రెస్క్యూ చర్యలు(Rescue Operations) అవిశ్రాంతంగా కొనసాగుతున్నా ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదు. ఇదిలా ఉండగా తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారనోనని ఆ కార్మికుల బంధువుల రోదనలు కన్నీరుపెట్టిస్తున్నాయి. పొట్టకూటి కోసం పనికి వస్తే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ప్రమాదం జరిగి దాదాపు నెల రోజులు కావొస్తుండటంతో వారంతా టన్నెల్‌లోనే సజీవ సమాధి అయినట్లు పలువురు భావిస్తున్నారు.

SLBC టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది సిబ్బంది ప్రాణాలు పోయినట్లేనా..?

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *