కొత్త రేషన్​ కార్డుదారులకు గుడ్ ​న్యూస్

కొత్త రేషన్‌ కార్డుల లబ్ధిదారులకు (Ration Cards) గుడ్ న్యూస్. ఈ నెల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది. గత నెలలో  రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి  గ్రామ, వార్డు సభలు నిర్వహించి రేషన్ కార్డులు అర్హులను ప్రకటించిన విషయం తెలిసిందే.

నాలుగు జిల్లాలు.. లక్ష దరఖాస్తులు

గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన మిగతా లబ్ధిదారులను అధికారులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి వచ్చే నెల నుంచి వారికి కూడా బియ్యం పంపిణీ చేయనున్నారు. మరోవైపు కొత్త రేషన్‌ కార్డుల కోసం నాలుగు జిల్లాల్లో కలిపి 1,01,103 దరఖాస్తులు వచ్చాయి.

అర్హులకు రేషన్ కార్డులు

గత నెలలో మండలానికో గ్రామంలో పంపిణీ చేసిన రేషన్‌ కార్డుల్లోని లబ్ధిదారులకు ఈనెల నుంచే బియ్యం (Ration Rice) పంపిణీ జరుగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలకు కార్డులు, లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుతుందని వెల్లడించారు. రేషన్‌ కార్డుల జారీ, సభ్యుల పేర్లు చేర్చడం, అనర్హుల పేర్లు తొలగించడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులందరికి రేషన్‌ కార్డులు వస్తాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *