టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis)ను కలిసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పిన హిట్మ్యాన్ ఉన్నట్టుండి మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంపదీసి రోహిత్బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా అని నెటిజన్లు, అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఫొటోలను పంచుకున్న సీఎం ఫడ్నవీస్
ముంబైలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను రోహిత్ శర్మ బుధవారం కలిశాడు. కొద్దిసేపు వారు భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సీఎం ఫడ్నవీస్ నేరుగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నా అధికారిక నివాసమైన వర్షలో రోహిత్ శర్మను కలుసుకోవడం, మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ పలికిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపాను. తన నూతన అధ్యాయంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోస్ట్ చేశారు.
#TeamIndia के विस्फोटक बल्लेबाज Rohit Sharma ने महाराष्ट्र के मुख्यमंत्री @Dev_Fadnavis से की मुलाकात आपको बता दें कि रोहित ने कुछ दिवस पहले ही टेस्ट क्रिकेट से सन्यास लिया है#RohitSharma𓃵 #Hitman #DevendraFadnavis #maharshtra #maharashtranews #Cricket #cricketer #Sports pic.twitter.com/eckbC4uowW
— websuchna (@websuchna) May 14, 2025
ఆ బాటలోనే వెళ్తున్నాడా అని చర్చ
కెరీర్కు గుడ్ బై చెప్పిన తర్వాత ఎంతోమంది క్రికెటర్లు రాజకీయాల్లో చేరారు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ ఇలా మహారాష్ట్ర సీఎంను కలవడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బీజేపీలో చేరి ఎంపీగా గెలిచాడు. ఆ బాటలోనే ఇప్పుడు రోహిత్ శర్మ వెళ్తున్నాడా అని చర్చ మొదలైంది. 2013లో టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఓవరాల్గా టీమిండియా తరఫున 67 టెస్టు మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్ 4301 పరుగులు చేశాడు.






