RCB vs KKR: కళ్లన్నీ కోహ్లీపైనే.. నేడు ఐపీఎల్ రీస్టార్ట్

క్రికెట్ అభిమానులకు మళ్లీ అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2025) వచ్చేసింది. భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల(India-Pak War Crisis)తో వాయిదా పడ్డ ఐపీఎల్ 2025.. ఈరోజు (మే 17) నుంచి పునఃప్రారంభం కానుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్(RCB vs KKR) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో RCB సూపర్ ఫామ్‌లో ఉంది. అదే ఊపులో ప్లేఆఫ్స్‌ దిశగా దూసుకెళ్తోంది. ఇవాళ్టి మ్యాచులో కేకేఆర్‌పై గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అటు దాదాపుగా టాప్-4కి దూరమైన KKR ఈ మ్యాచ్‌‌లో గెలిచి ఆర్సీబీని ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తోంది.

ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో ఆర్సీబీ

రజత్‌ పాటీదార్‌ సారథ్యంలోని RCB లీగ్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లాడి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అడుగుదూరంలో ఉంది. కోల్‌కతాపై నెగ్గి నాకౌట్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు 12 మ్యాచ్‌లాడి 11 పాయింట్లతో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌, రహానే కెప్టెన్సీలోని నైట్‌రైడర్స్‌కు ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరుజట్ల మధ్య జరిగే ఈ రసవత్తర పోరు అభిమానులను అలరించడం ఖాయం.

KKR vs RCB: Probable Playing 11s For IPL 2025 Season Opener At Eden Gardens

మ్యాచ్‌కు పొంచి ఉన్న వర్షం ముప్పు

ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో జరగాల్సి ఉంది. టెస్టులకు రిటైర్మెంట్ పలికిన తర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్‌పై RCB ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ(IMD) అంచనాల ప్రకారం మ్యాచ్ జరిగే రోజైన శనివారం అక్కడ వర్షం పడే అవకాశం ఉంది. కాగా శనివారం రాత్రి 7 గంటలకు టాస్ పడి.. 7.30 మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాత్రి 7 గంటలకు 71% వర్షం పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. రాత్రి 8 గంటలకు 69%, రాత్రి 9 గంటలకు 49%, రాత్రి 10 గంటలకు 34% వర్షం పడే అవకాశం ఉందని IMD తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *