GT vs RR: సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ.. టైటాన్స్ భారీ స్కోరు

ఐపీఎల్‌ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్(GT) 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు 3వ ఓవర్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ గిల్ (2) పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (82)కి సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అటు బట్లర్ (36) సైతం ఉన్నంత సేపు బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

ఈ క్రమంలో జట్టు స్కోరు 94 పరుగుల వద్ద బట్లర్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షారుఖ్ ఖాన్ (36), రాహుల్ తెవాటియా, రషీద్ (12) రన్స్ చేయడంతో టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 రన్స్ చేసింది. రాయల్స్ బౌలర్లలో తుషార్ 2, తీక్షణ 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ చెరో వికెట్ పడగొట్టారు. రాయల్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 218 రన్స్ చేయాలి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *