తెలంగాణలోని భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నది(Godavari River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులపైకి చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ(Issue of second hazard warning) చేశారు. 53 అడుగులకు చేరుకోగానే చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు గోదావరి నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి
రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
48 అడుగులకి చేరుకున్న గోదావరి నీటి మట్టం
53 అడుగులకు మూడోవ మరియు చివరి ప్రమాద హెచ్చరిక pic.twitter.com/pZODnm1iJo
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2025
గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాల(For flood zones)కు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు చేరడంతో చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది. పట్టణంలోకి వరద నీరు రాకుండా అధికారులు కరకట్టకు ఉన్న స్లూయిజ్(Sluice)లను మూసివేశారు.






