Telangana Police: తెలంగాణలో 77 మంది పోలీసుల అధికారుల బదిలీ

తెలంగాణలో పోలీస్ అధికారులకు పోలీస్‌ శాఖ స్థానభ్రంశం కల్పించింది ఈ మేరకు సోమవారం సాయంత్రం తెలంగాణ పోలీస్‌శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్(DGP Jitender) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జగిత్యాల DSPగా వెంకటస్వామి, బాలానగర్‌ ACPగా నరేశ్ రెడ్డి, శంషాబాద్ ACPగా శ్రీకాంత్ గౌడ్, మాదాపూర్ ACP‌గా సీహెచ్‌ శ్రీధర్‌ను నియమించింది.

Telangana SI Candidates Training 2023 : కొత్త ఎస్సైల శిక్షణకు సర్వం  సిద్ధం.. ఈ తేదీ​ గుర్తుపెట్టుకోండి

అలాగే చిక్కడపల్లి ACPగా శ్రీకాంత్, మేడ్చల్ ACPగా శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ACPగా సుఖ్‌దేవ్‌సింగ్, హుజూరాబాద్ DSPగా మాధవి, కామారెడ్డి DSPగా శ్రీనివాసరావు, పటాన్ చెరు ACPగా ప్రభాకర్, సిద్దిపేట ACPగా రవీందర్ రెడ్డి, కూకట్‌పల్లి ACPగా రవికిరణ్ రెడ్డి, పేట్‌బషీర్‌బాద్ ACPగా బాలగంగిరెడ్డి, మహేశ్వరం ACPగా జానకిరెడ్డి, షాద్‌నగర్‌ ACPగా లక్ష్మినారాయణ సహా మొత్తం 77 మందిని DGP బదిలీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *