Best Fielder Medal: బెస్ట్ ఫీల్డర్‌గా శ్రేయస్.. మెడల్ అందించిన రవిశాస్త్రి

స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే వరల్డ్ కప్-2023(ODI World Cup) నుంచి టీమ్ఇండియా(Team India) మేనేజ్‌మెంట్ ఓ స‌రికొత్త సంప్రదాయానికి తెర‌తీసింది. ప్లేయర్లను ప్రోత్స‌హించ‌డానికి బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్‌(Best Fielder Medal)ను తీసుకువ‌చ్చింది. దీనిని ప్రతి మ్యాచ్‌లో బెస్ట్‌గా ఫీల్డింగ్ చేసిన ఆట‌గాడిని గుర్తించి ఈ మెడ‌ల్‌ను అందిస్తూ వ‌స్తోంది. ఇక ఈ సంప్ర‌దాయాన్ని ఛాంపియ‌న్స్ ట్రోఫీ(Champions Trophy- 2025) లోనూ కొన‌సాగిస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో వికెట్ కీప‌ర్ KL రాహుల్, పాక్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ మెడ‌ల్ అందుకున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ కైవసం చేసుకున్నాడు. ఇక తాజాగా ఆసీస్‌తో మ్యాచులోనూ ఈ మెడల్ కోసం ముగ్గురు ప్లేయర్లు పోటీపడ్డారు.

సూపర్ రనౌట్ చేసిన అయ్యర్

ఆస్ట్రేలియా(Australia)తో మ్యాచులో అద్భుత క్యాచ్ అందుకున్న శుభ్ మన్ గిల్, సూపర్ బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా(Jadeja), మెరుపు ఫీల్డింగ్‌తో అలెక్స్ క్యారీని రన్ ఔట్ చేసిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఈ మెడల్ కోసం కంటెండర్లు ఎంపికయ్యారు. అయితే వీరిలో అయ్యర్‌కే టీమ్ మేనేజ్మెంట్ జై కొట్టింది. రెండు పరుగుకోసం ప్రయత్నించిన క్యారీ(Alex Carey)ని డైరెక్ట్ త్రోతో రన్ ఔట్ చేసిన అయ్యర్‌కే బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందించింది.

దీనిని మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) చేతుల మీదుగా అయ్యర్‌కి అందించింది. ఈ సందర్భంగా రవిశాస్త్రి ఆటగాళ్లను ఎంకరేజ్ చేశారు. టీమ్‌ స్పిరిట్‌ కనబరిచి అద్భుతంగా ఆడారని కొనియాడారు. ఇంక ఒక్క మ్యాచ్ మిగిలి ఉందని, అందులోనూ నెగ్గి ట్రోఫీ కైవసం చేసుకోవాలంటూ ALL THE BEST చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *