Today Market: గోల్డ్ రేట్ మళ్లీ హైక్.. కేజీ సిల్వర్ ప్రైజ్ రూ. 1,08,000

బంగారం ధరలు(Gold Rates) దోబూచులాడుతున్నాయి. శనివారం (ఫిబ్రవరి 15) ఏకంగా రూ.1000కిపైగా ధగ్గిన పసిడి రేట్లు ఇవాళ మళ్లీ పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. శుభకార్యాల సీజన్ సమయంలో కొంతైన పుత్తడి కొనుగోలు చేద్దామనుకుంటే ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోతున్నారు. కొందరు మాత్రం పెళ్లిళ్లకు బంగారం తప్పని సరని, రేటు ఎంత పెరిగినా కొంచెం అయినా కొనుగోలు చేయక తప్పడం లేదని అంటున్నారు.

కాగా ఇవాళ (ఫిబ్రవరి 17) హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.500 పెరిగి రూ. 79,400 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ ప్రైజ్(Gold Price) రూ. 550 పెరిగి రూ.86,620గా ఉంది. మరోవైపు సిల్వర్ రేట్లు(Silver Rate) సైతం పసిడికి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇవాళ కేజీ వెండి ధర రూ.1,08,000వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక ఈ వారంలో మొదటిరోజైన సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు(Stock Market) నష్టాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం బీఎస్‌ఇ సెన్సెక్స్(Senxsex) 608.83 పాయింట్లు తగ్గి 75,330.38 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. NSE నిఫ్టీ(Nifty) 194.50 పాయింట్లు తగ్గి 22,734.75 పాయింట్ల వద్ద చలిస్తోంది.

Stock Market: నష్టాలకు అలవాటు పడ్డ స్టాక్ మార్కెట్లు.. మళ్లీ అదే జరిగిందిగా!

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *