భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఆరుగురు మృతి

భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆరంతస్తుల భవనానికి స్లాబ్ నిర్మాణం చేపట్టారు. అయితే దాన్ని అలాగే వదిలేశారు. కొంతకాలంగా అలాగే ఉన్న ఆ భవనం బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

ఆరుగురు మృతి

భవనం కుప్పకూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రొక్లెయిన్ల సాయంతో ప్రస్తుతం సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *