భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఆరుగురు మృతి

భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆరంతస్తుల భవనానికి స్లాబ్ నిర్మాణం చేపట్టారు. అయితే దాన్ని అలాగే వదిలేశారు. కొంతకాలంగా అలాగే ఉన్న ఆ భవనం బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

ఆరుగురు మృతి

భవనం కుప్పకూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రొక్లెయిన్ల సాయంతో ప్రస్తుతం సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *