South Korea: ‘నన్ను క్షమించండి’.. మళ్లీ ఆ తప్పు చేయనన్న ప్రెసిడెంట్

దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు తమ దేశ ప్రజలను క్షమాపణ కోరాడు. ఇంకోసారి అలాంటి తప్పు చేయనని పశ్చాత్తాప పడ్డాడు. అసలు ఏమైంది? దేశ ప్రజలకు అధ్యక్షుడు ఎందుకు క్షమాపణలు చెప్పాడో చూద్దాం రండి..

దక్షిణ కొరియాలోని ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్నారని ఆక్షేపిస్తూ ఆ దేశ అధ్యక్షుడు యూన్​ సుక్​ యోల్ (Yoon Suk Yeol)​ ఇటీవల దేశలో ఎమర్జెన్సీ మార్షల్​ లా ( martial law declaration) విధించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతోపాటు దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. విపక్షాల నేతలు పార్లమెంట్​లో ఓటింగ్​ పెట్టి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానం పెట్టి వెంటనే ఆమోదించారు. ఈ తీర్మానం 190–0తో నెగ్గింది. దీంతో కొద్దిసేపటికే ఎమర్జెన్సీని ఎత్తివేశారు.

దేశవ్యాప్తంగా వ్యతిరేకత

ఈ పరిణామాలతో అధ్యక్షుడు యూన్​ సుక్​ యోల్​పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచి కూడా మద్దతు లభించలేదు. యూన్​ సుక్​ యోల్​ తన పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు.. పార్లమెంట్​లో (parliament) అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు. శనివారం సాయంత్రం ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానంపై పార్లమెంట్​లో ఓటింగ్​ నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్​లో అధ్యక్షుడికి వ్యతిరేకంగానే అధిక ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఆయన అధ్యక్ష పదవి కోల్పోవడం ఖాయం.

ఈ నేపథ్యంలోనే యూన్​ ఓ టీవీ ఛానెల్​తో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. సీటులో నుంచి లేచి నిల్చొని క్షమించాలని కోరారు. ‘ఎమర్జెన్సీ మార్షల్​ లా కారణంగా ప్రజలను ఆందోళనకు, అసౌకర్యానికి గురిచేసినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నా. ఇంకోసారి ఎమర్జెన్సీ విధించే ప్రయత్నం చేయబోనని హామీ ఇస్తున్నా. ప్రకటన కోసం నా రాజకీయ, చట్టపరమైన బాధ్యతను తప్పించుకోలేను’ అని పేర్కొన్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *