Ashwin: అల్విదా అశ్విన్​.. క్రికెట్​కు వీడ్కోలు పలికిన స్పిన్​ లెజెండ్​

భారత లెజండరీ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు (AUS vs IND) ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్‌ తన రిటైర్మెంట్​ ప్రకటన చేశాడు. అశ్విన్​ (Ravichandran Ashwin) మాట్లాడుతూ.. ‘భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. క్రికెటర్‌గా నాలో ఇంకాస్త ఆట ఉందని అనుకుంటున్నా. తప్పకుండా క్లబ్‌ క్రికెట్‌లో ఆడతా. అయితే, అంతర్జాతీయ క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. ఎన్నో అనుభవాలను అందించిన సహచర క్రికెటర్లకు థాంక్యూ’ అని అన్నారు.

భావోద్యోగం
ఈ సందర్భంగా ఎంతో మందిని గుర్తు చేసుకోవాలన్న అశ్విన్​.. ముఖ్యంగా బీసీసీఐ ధన్యవాదాలు తెలిపాడు. సహచరులకు థాంక్యూ చెబుతూ.. రోహిత్, విరాట్, అజింక్య, పుజారా ఈ జాబితాలో తప్పక ఉంటారని అన్నాడు. ‘ఆస్ట్రేలియన్ క్రికెట్‌కూ ధన్యవాదాలు. నాకు మంచి పోటీ ఇచ్చిన క్రికెట్ జట్టు. నాకు ఇవి భావోద్వేగానికి గురయ్యే క్షణాలు’’ అంటూ అశ్విన్ అన్నాడు.

స్వదేశానికి రానున్న అశ్విన్​
ఈ సందర్భంగా ప్రెస్​కాన్ఫరెన్స్​లో కెప్టెన్​ రోహిత్​ శర్మ (Rohit sharma) మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకకటించిన అశ్విన్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నాడు. మిగిలిన రెండు టెస్టులో అతడు ఆడడని గురువారం భారత్‌కు రానున్నాడని తెలిపాడు.

765 వికెట్లు
టీమ్‌ఇండియా తరఫున 106 టెస్టులు ఆడిన అశ్విన్​ 537 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్​ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. భారత్​ తరపున టెస్ట్ క్రికెట్లో అతి వేగంగా 50, 100, 150 వికెట్లు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా 765 వికెట్లు పడగొట్టాడు.

ఇవీ బ్యాటింగ్​ గణాంకాలు
అదేవిధంగా బ్యాట్స్‌మెన్‌గానూ అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 3503 పరుగులు చేసి రికార్డు సాధించాడు. 6 సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 8 సెంచరీలు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 4,400 పరుగులు సాధించాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *