సీజ్ ది లయన్.. SSMB29 షూటింగ్ షురూ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. #SSMB29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. సింహాన్ని లాకప్ లో లాక్ చేసినట్లు వీడియో చేశారు. పాస్‌పోర్ట్‌ చూపిస్తూ ఫొటోకు పోజ్‌ ఇచ్చి సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.

జక్కన్న పోస్టు.. మహేశ్ బాబు రియాక్షన్

రాజమౌళి పోస్టుతో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనట్లేనని అభిమానులు అనుకుంటున్నారు. ఈ వీడియోకు రాజమౌళి (SS Rajamouli) ‘క్యాప్చర్‌’ అనే క్యాప్షన్‌ పెట్టగా.. ఈ పోస్టుపై మహేశ్‌ బాబు, ప్రియాంక చోప్రా స్పందించడంతో మహేశ్ బాబు, జక్కన్న సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా ఫిక్స్ అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ పోస్టుపై మహేశ్ బాబు ‘‘ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను’’ అంటూ పోకిరి డైలాగు కామెంట్‌ చేశారు.

ప్రియాంకా చోప్రాయే హీరోయిన్

మరోవైపు మొత్తానికి షూటింగ్‌ ప్రారంభమైంది అని అర్థం వచ్చేలా ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ఫైనల్లీ అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నా.. ఇటీవల ఆమె హైదరాబాద్ రావడంతో అభిమానులు ఈ సినిమా కోసమే వచ్చారని ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా జక్కన్న పోస్టుకు కామెంట్ పెట్టడంతో ఇక ప్రియాంకానే మహేశ్ హీరోయిన్ అని కన్ఫామ్ చేసేశారు.

అమెజాన్ అడవుల నేపథ్యంలో సినిమా

మహేశ్‌- రాజమౌళి కాంబోలో రానున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని సినీ లవర్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే మహేశ్‌ లుక్ మార్చారు. ఇక ఈ సినిమాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ యానిమల్స్ ఉంటాయని రాజమౌళి ఓ ఈవెంట్‌లో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు (ssmb29 Latest Update) కనిపించనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *