Coolie Movie Update: రజినీకాంత్ ‘కూలీ’ రన్ టైమ్ ఎంతంటే?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కూలీ(Coolie)’. తాజాగా ఈ మూవీ సెన్సార్(Censor) ప్రక్రియను పూర్తి చేసుకుంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A-సర్టిఫికెట్ జారీ చేసింది, అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే పరిమితం. ఇక ఈ చిత్రం రన్ టైం(Coolie Movie Run Time) 170 నిమిషాలుగా ఉంది, అంటే 2 గంటల 50 నిమిషాలు ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నాగార్జున

‘కూలీ’ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్(Gold Smuggling) నేపథ్యంలో రూపొందింది. ఇందులో రజినీకాంత్ ‘దేవా(Deva)’ అనే పాత్రలో కనిపించనున్నారు. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సైమన్ అనే నెగటివ్ షేడ్స్ ఉన్న గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Rs 3310 crore net worth: Meet the richest actor of Coolie movie

హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో

సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్(Teaser), ట్రైలర్(Trailer), ఆడియో లాంచ్‌లతో ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెజాన్ డెలివరీ బాక్స్‌లపై సినిమా పోస్టర్లతో వినూత్న ప్రచారం కూడా జరిగింది. ఈ చిత్రం లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు రజినీకాంత్ మార్క్ మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. సెన్సార్ ‘ఏ’ సర్టిఫికెట్ కారణంగా వైలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవచ్చని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ రన్ టైంతో ‘కూలీ’ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందా లేక అంచనాలను అందుకోలేదనే చర్చలు మొదలవుతాయా అనేది ఆగస్టు 14న విడుదలైన తర్వాతే తేలనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *