16 ఏళ్లకు భారత్‌కు తహవ్వుర్‌ రాణా.. హై అలర్ట్ లో ఢిల్లీ

26/11 ముంబయి ఉగ్రదాడి (26/11 Mumbai terror attacks) కి సూత్రధారి తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎట్టకేలకు భారత్ చేతికి చిక్కాడు. ముంబయి దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ చేతికి చిక్కి లాస్‌ ఏంజెలెస్​లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్​లో నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం తనను భారత్​కు అప్పగించకుండా ఉండేందుకు అన్ని రకాల న్యాయమార్గాలు ఉపయోగించినా ఫలితం లేకపోయింది. చట్టం అతడి చుట్టం కాదని నిరూపిస్తూ.. నిందితుల అప్పగింత ప్రక్రియలో భాగంగా రాణాను అమెరికా భారత్ కు అప్పగించాలని నిర్ణయించింది.

కాసేపట్లో భారత్‌కు రాణా

ఇందులో భాగంగా కాసేపట్లో తహవ్వుర్ రాణా భారత్ కు చేరుకోనున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో (High Alert in Delhi) ఉన్నతాధికారులు హై అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు రాణాను తరలించే ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకున్నారు. అతణ్నితరలించేందుకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారు. రాణాను తీసుకువస్తోన్న విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే అతణ్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ హెడ్ ఆఫీసుకు తీసుకెళ్లనున్నారు.

ఢిల్లీలో హై అలర్ట్

ఈ క్రమంలో కొన్ని సాయుధ వాహనాలు ఆ వాహనాన్ని ఫాలో కానున్నాయి. మరోవైపు ఢిల్లీకి చెందిన  స్పెషల్ సెల్‌ను అలర్ట్‌లో ఉంచిన అధికారులు.. SWAT కమాండోలను ఎయిర్ పోర్టు వద్ద అలర్ట్ లో ఉంచారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ తో పాటు మార్క్స్‌మ్యాన్‌ వెహికిల్ రెడీగా ఉంచినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయిన రాణాను దాదాపు 16 ఏళ్లకు భారత్‌కు చిక్కాడు. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నరేందర్‌ మాన్‌ నియమితులయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *