INDvsENG 2nd T20: తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. భారత్‌ను గెలిపించిన తెలుగోడు

చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్‌(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 12, సూర్య కుమార్ 12, సుందర్ 26 రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివరకు క్రీజులో ఉండి టీమ్ఇండియాను గెలిపించిన తిలక్ వర్మ(Tilak Varma)కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, ఆర్చర్, వుడ్, రషీద్, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.

78కే 5 వికెట్లు అయినా 165 రన్స్

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌(England)కు ఓపెనర్లు ఈ మ్యాచులోనూ నిరాశపర్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఒకానొక దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ కెప్టెన్ బట్లర్ (45), స్మిత్ 22, కార్స్ 31 రన్స్ చేయడంతో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్, వరుణ్ చెరో రెండు వికెట్లు తీయగా, అర్షదీప్, పాండ్య, సుందర్, అభిషేక్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. ఇక మూడో T20 జనవరి 28న రాజ్‌కోట్(Rajkot) వేదికగా జరగనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *