BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో ఇద్దరికి బెయిల్

తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో భుజంగరావు, రాధాకిషన్‌(Bhujangarao, Radhakishan)కు గురువారం హైకోర్టు బెయిల్(High Court Bail) మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని షరతు పెట్టింది. పాస్ పోర్టులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరినీ ఆదేశించింది. ఇదే కేసులో తిరుపతన్న(Tirupattana)కు కూడా కోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు ఏడాది కాలంగా నడుస్తున్న కేసు దర్యాప్తులో భాగంగా.. కీలక పాత్రదారులైన కొందరు మాజీ పోలీసు ఉన్నతాధికారులను విచారించి, అరెస్ట్ కూడా చేశారు. ఇన్ని రోజులు విచారణలు అరెస్టులు జరగ్గా.. మొట్టమొదటిసారిగా కీలక పాత్రధారులుగా భావిస్తున్న వ్యక్తులకు బెయిల్(Bail) మంజూరు కావటం గమనార్హం.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీసులకు చుక్కెదురు! | Court  Twist In Telangana Phone Tapping Case, More Details Inside | Sakshi

వ్యతిరేకగళం వినిపించేవారిన టార్గెట్‌గా చేసుకుని..

కాగా తెలంగాణలో గత BRS ప్రభుత్వ హయాంలో.. ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ వ్యతిరేకంగా గళం విప్పేవారు, సొంత పార్టీలో వ్యతిరేక గళం వినిపించేవారిన టార్గెట్‌గా చేసుకుని ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం సాగినట్టుగా నిందితులు విచారణలో వెల్లడిస్తున్నారు. జడ్డిలు, జర్నలిస్టులు, విద్యార్థి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా చెబుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీ నేతలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకున్నట్టుగా.. మూడు ఉప ఎన్నికల్లో, గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana assembly Election 2023) స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) OSD ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు BRS గెలుపు లక్ష్యంగా పనిచేసినట్టుగా కూడా వాంగ్మూలంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *