విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Mana Enadu : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.  రాష్ట్రంలో ఇంటర్​ పరీక్షలకు​ షెడ్యూల్ (Intermediate Exams)​ ఖరారైంది. 2025 మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్​ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. జనవరి 29 ఎథిక్స్​ అండ్​ హ్యూమన్​ వాల్యూస్​ పరీక్ష జరగనున్నట్లు తెలిపింది. ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల షెడ్యూల్​ ఇదే..

ఇంటర్ పరీక్షల ముఖ్యమైన తేదీలు ఇవే :

  • మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు
  • ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్
  • జనవరి 29న ఇంటర్‌ ఎథిక్స్ అండ్‌ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్  :

పరీక్ష తేదీ సబ్జెక్టు
05-03-2025 సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1
07-03-2025 ఇంగ్లిష్‌ పేపర్-1
11-03-2025 గణితం పేపర్‌-1ఏ బోటనీ పేపర్‌-1 పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1
13-03-2025 గణితం పేపర్‌ -1బి జూవాలజీ పేపర్‌-1 హిస్టరీ పేపర్‌-1
17-03-2025 ఫిజిక్స్ పేపర్‌-1 ఎకనామిక్స్‌ పేపర్‌-1
19-03-2025 కెమిస్ట్రీ పేపర్‌-1 కామర్స్‌ పేపర్‌-1
21-03-2025 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1 బ్రిడ్జ్‌ కోర్సు గణితం పేపర్‌-1 (బైపీసీ విద్యార్థులకు)
24-03-2025 మోడ్రన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1 జాగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్

పరీక్ష తేదీ సబ్జెక్టు
06-03-2025 సెంకడ్‌ ల్యాంగ్వేజ్ పేపర్‌-2
10-03-2025 ఇంగ్లిష్‌ పేపర్-2
12-03-2025 గణితం పేపర్‌-2ఏ బోటనీ పేపర్‌-2 పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-2
15-03-2025 గణితం పేపర్‌ -2బి జూవాలజీ పేపర్‌-2 హిస్టరీ పేపర్‌-2
18-03-2025 ఫిజిక్స్ పేపర్‌-2 ఎకనామిక్స్‌ పేపర్‌-2
20-03-2025 కెమిస్ట్రీ పేపర్‌-2 కామర్స్‌ పేపర్‌-2
22-03-2025 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2 బ్రిడ్జ్‌ కోర్సు గణితం పేపర్‌-2 (బైపీసీ విద్యార్థులకు)
25-03-2025 మోడ్రన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-2 జాగ్రఫీ పేపర్‌-2

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *