Breaking:రాజ్యసభకు ఫైర్ బ్రాండ్..తెలంగాణ నుంచి రేణుకా చౌదరి

మన ఈనాడు: ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రేణుకాచౌదరి పేరును ఖరారు చేశారు. హైకమాండ్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో నామినేషన్ దాకలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి రేణుకాచౌదరికి ఇవ్వగా…మరో సీటు ఏఐసీసీకి రిజర్వ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి ఏఐసీసీ నుంచి అజయ్ మాకెన్ లేదా సుప్రియలలో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. మొదటి నుంచీ ఆమె ఖమ్మం పార్లమెంట్ స్థానంపైనే ఫోకస్ చేసారు. సోనియా వస్తారు…కమ్మం నుంచి పోటీ చేస్తారు అన్న టాక్ నడవడంతో కొన్నాళ్ళు దాన్ని పక్కన పెట్టారు. అప్పుడు కూడా సోనియా తప్పుకుంటే ఖమ్మం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని రేణుకాచౌదరి హాట్ కామెంట్స్ చేశారు.

ఇప్పుడు సోనియా రావడం లేదు… మరోవైపు రేణుకా చౌదరి పేరు ఖరారు అయిపోయింది. దీంతో ఖమ్మం లోక్ సభ స్థానాన్ని రేణుకాకే కేటాయించాలని కోరుతూ గాంధీభవన్‌లో ఆమె వర్గీయులు దరఖాస్తు చేశారు. రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలిగా, కేంద్రమంత్రిగా కూడా రేణుకా చౌదరి గతంలో సేవలు అందించారు. ఇప్పుడు ఆమె మారు రాజ్యసభకు నామినేట్ అవుతుండటంతో రేణుకా వర్గీయులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *