BREAKING: త్వరలోనే పంచాయతీ ఎన్నికలు: సీఎం రేవంత్

తెలంగాణ(Telangana)లో త్వరలోనే గ్రామ పంచాయితీ ఎన్నికలు(Panchayat Elections) నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. బుధవారం రాత్రి ఆయన TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం ఆయనతో చర్చించారు. ప్రభుత్వ పథకాలను వీలైనంత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని CM సూచించారు. అలాగే జనవరి 26న రైతు భరోసా(Rythu Bharosa) ఇస్తున్నామని చెప్పారు. కూలీ రైతులకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ(Runa Maafi) చేశామని సీఎం స్పష్టం చేశారు. అలాగే త్వరలో కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు.

ఇప్పటికే ఓటర్ల జాబితా రెడీ

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలు(Panchayat Elections) ఉండవచ్చనే సంకేతాలు ఉండటంతో అధికార యంత్రాంగం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా(List of Voters)ను గ్రామాలు, వార్డుల వారీగా రెడీ చేయగా, తాజాగా కొత్త పేర్లను వార్డుల వారీగా సేకరిస్తున్నారు. మరోవైపు ఓటర్లకు సరిపడా బ్యాలెట్ పత్రాల ముద్రణ(Printing of ballot papers) కోసం కసరత్తు మొదలుపెట్టారు. బ్యాలెట్ పేపర్ అధికారులే సరఫరా చేస్తుండగా, దానిపై గుర్తులు మాత్రం ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో ముద్రిస్తారు.

సార్వత్రిక ఎన్నికలు రావడంతో..

అలాగే బరిలో 4, 5గురు, పది మంది ఉన్నట్లు, ఇలా గుర్తులతో ముందస్తుగానే ముద్రించుకొని సిద్ధంగా ఉంచాలా? లేక అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేలాక ముద్రించాలా అనే దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతుండటంతో ఆ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు(General Elections) రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిగదా పడ్డాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *