సీతా కళ్యాణ వైభోగమే’ అలరించబోతుంది.. ట్రైలర్ లాంచ్ చూశారా..?

Mana Enadu: హీరో సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు.

హీరో సుమన్ తేజ ఫస్ట్ ఫిల్మ్, దర్శకుడుయసతీష్ రెండో చిత్రమని, నీరూస్ సంస్థకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. జూన్ 21న ఈ చిత్రం రాబోతోందని అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

తెలుగు సంప్రదాయాన్ని చాటేలా ఉంది. మంచి చిత్రం తీసిన యుగంధర్ గారికి మంచి విజయం దక్కాలి. సతీష్ చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఊరికి ఉత్తరాన సినిమా నాకు నచ్చింది. ఈ సినిమాతో సతీష్‌కు పెద్ద విజయం దక్కాలి. సుమన్, గరిమ ఇద్దరూ చక్కగా నటించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘మా సినిమా పాటలు టీ-సీరిస్ ద్వారా రిలీజ్ అయ్యాయి. మా ట్రైలర్ అందరికీ నచ్చింది. హర్షిత్ రెడ్డి గారు బలగం సినిమాతో బలాన్ని ఇచ్చారు. హర్షిత్ రెడ్డి గారి కజిన్ సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. చరణ్ అర్జున్ గారు మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్ గారికి సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉంది. కొందరికి తాతలు, ముత్తాతల పేర్లు కూడా తెలీదు. కానీ రాముడి గుడి లేని ఊరు ఉండదు. ఆయన బతికిన విధానం వల్లే అందరికీ గుర్తుండిపోయారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశాను. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ అన్నకి థాంక్స్. ఈ చిత్రం 90s కిడ్స్ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ ప్రయాణంలో మాకు అన్ని రకాల ఎమోషన్స్ ఎదురయ్యాయి. మా ఈ ప్రయాణంలో మేం రెండు చిత్రాలు చేశాం. ఆ రెండూ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

నీరూస్ ప్రతినిధి ఆసిం మాట్లాడుతూ.. ‘సతీష్‌తో మాకు మంచి అనుబంధం ఏర్పడింది. యుగంధర్ గారు చాలా మంచి వ్యక్తి. సుమన్, గరిమ, గగన్ చాలా అద్భుతంగా నటించారు. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *