AP Rain Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు

Mana Enadu:గత రెండ్రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలను వానలు (Rain s in Telugu States) వణికిస్తున్నాయి. శనివారం, ఆదివారం రెండ్రోజులు ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఏకధాటిగా వానలు కురిశాయి. భారీ ఎత్తున వరదలు సంభవించాయి. పల్లెలు, పట్టణాలు నీట మునిగాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు, గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఇంకా వరద (Telangana Floods) నుంచి ప్రజలు తేరుకోలేదు. మరోవైపు అధికారులు సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కురిసిన వర్షం నుంచి తేలుకోలేదంటే.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంటున్నారు.

ఏపీలో వర్ష బీభత్సం నుంచి తేరుకోకముందే రాష్ట్రంలో మళ్లీ వర్షాలు (AP Rain Alert కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్‌ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (low pressure) ఏర్పడే సూచనలున్నాయని తెలిపారు. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి విదర్భ, తెలంగాణ (Telangana Rains) మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఆవరించి ఉండనున్నట్లు అంచనా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలుచోట్ల కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుండగా వాతావరణ అధికారుల తాజా ప్రకటనతో తెలుగు రాష్ట్రాలు మరింత అప్రమత్తమయ్యాయి.

వాతావరణ శాఖ ప్రకటనతో ఏపీ ప్రభుత్వం (AP Govt) అప్రమత్తమైంది. ప్రస్తుతం వరద ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ఆ నీటిని తొలగించి, అక్కడ ప్రజలకు సాధారణ పరిస్థితులు కల్పించే పనిలో పడింది ప్రభుత్వ యంత్రాంగం. ఇందుకోసం ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. వరద ప్రాంతంలోని నీటిని తొలగిస్తోంది. మరోవైపు మరో మూడ్రోజుల్లో వర్షాలు (Rains Alert in AP) కురవనున్నందున ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురవ్వకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రస్తుతం దృష్టి సారిస్తోంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *