BGT 2nd Test Day-1: తొలిరోజు ఆసీస్‌దే.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన భారత్

BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. అడిలైడ్‌(Adelaide) వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 30 ఓవర్లలో 86/1 స్కోరు చేసింది. ప్రస్తుతం మెక్ స్వీనీ (38*), లబుషేన్ (20*) క్రీజులో నాటౌట్‌గా ఉన్నారు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) ఇంకా 94 పరుగులు వెనకబడి ఉంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 180 పరుగులకే కుప్పకూలింది. అయితే, నితీశ్ రెడ్డి 42 పరుగులతో రాణించి భారత్ స్కోరు 150 దాటేలా చేశాడు. మ్యాచ్ మళ్లీ రేపు ఉదయం 9.30కి ప్రారంభం కానుంది.

భారత్‌కు షాకిచ్చిన స్టార్క్

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన భారత్‌(India)కు ఇన్నింగ్స్​ తొలి బందికే టీమిండియాకు స్టార్క్​ షాకిచ్చాడు. ఓపెనర్​ యశస్వీ జైస్వాల్​ను డకౌట్​ చేశాడు. విరాట్​ కోహ్లీని (Virat Kohli) కూడా అతడే (7) పెవిలియన్​ చేర్చాడు. ఇక ఓపెనర్​గా కాకుండా ఆరో స్థానంలో వచ్చిన కెప్టెన్​ రోహిత్​ శర్మ (3) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 3 రన్స్​ మాత్రమే చేసి బోలాండ్​ బౌలింగ్​లో LBWగా వెనుదిరిగాడు. రిషభ్​ పంత్​ (21), అశ్విన్​ (22) స్వల్ప స్కోర్లు చేసి ఔటయ్యారు.​ ఆసీస్​ బౌలర్లలో స్టార్క్​ 6 వికెట్లు పడగొట్టగా.. ప్యాట్​ కమిన్స్​, స్కాట్​ బోలాండ్​ చెరో 2 వికెట్లు తీశాడు.

నితీశ్ వన్ మ్యాన్ షో

తెలుగు కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(42) భారత జట్టులో విలువైన ప్లేయర్‌గా మారుతున్నాడు. కష్టాల్లో నిలిచిన టీమిండియా‌ను మరోసారి ఒంటిచేత్తో ఆదుకున్నాడు. సంచలన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లను వణికించాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో బౌండరీల (3సిక్సులు, 3 ఫోర్లు)తో చెలరేగాడు. బొలాండ్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్‌తో నితీశ్ రెడ్డి బాదిన సిక్సర్ ఈ ట్రోఫీకే హైలైట్‌గా నిలవడం ఖాయం. కాగా తొలి టెస్టులోనూ నితీశ్ 41, 38 రన్స్ చేసిన విషయం తెలిసిందే.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *