BGT 5th Test Day-1: మారని టీమ్ఇండియా ఆట.. 185కే కుప్పకూలిన భారత్

BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులోనూ టీమ్ఇండియా తడబడింది. సిడ్నీ(Sydney) వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో తొలిరోజు 72.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకే కుప్పకూలింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా(India)ను ఓపెనర్లు మరోసారి నిరాశపర్చారు. జైస్వాల్, రాహుల్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. భారత బ్యాటర్లలో పంత్(40), జడేజా (26) మాత్రమే రాణించారు. జైస్వాల్ (10), రాహుల్ (4), గిల్ (20), కోహ్లీ(17), నితీశ్ (0), సుందర్(14), ప్రసిద్ధ్ (3), బుమ్రా (22), సిరాజ్ (3) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో బొలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2, లయన్ వికెట్ పడగొట్టారు. ఆసీస్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

పంత్‌కు గాయం

అంతకుముందు భార‌త బ్యాట‌ర్ రిష‌భ్ పంత్(Rishabh pant) గాయ‌ప‌డ్డాడు. ఆసీస్ పేస‌ర్ మిచెల్ స్టార్క్(Starc) విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాక‌డంతో వెంట‌నే వాపు వ‌చ్చేసింది. ఆ నొప్పి(Pain)తో పంత్ విల‌విల‌లాడాడు. బంతి తగిలిన చోట పెద్ద‌ మ‌చ్చ‌లా ఏర్ప‌డింది. వెంట‌నే సిబ్బంది వ‌చ్చి చికిత్స అందించారు. ఆ త‌ర్వాత పంత్ తిరిగి ఆట‌ను కొన‌సాగించాడు. 35 ఓవ‌ర్‌ మూడో బంతికి ఇలా పంత్ గాయ‌ప‌డ్డాడు. బంతి బ‌లంగా తాక‌డంతో వెంట‌నే స్టార్క్.. పంత్ వ‌ద్ద‌కు వ‌చ్చి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత గాయంతోనే పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *