Cricket Retirements: 2024లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది వీరే!

ఎలాంటి విధుల్లోనైనా ఒకానొక స్థాయిలో తమ విధులకు వీడ్కోలు(Retirement) చెప్పడం తప్పదు. అది వృత్తిపరంగా అయినా కావొచ్చు.. ఆటల్లోనూ కావొచ్చు. మరే ఇతర విభాగం అయినా కావొచ్చు. అలాంటి న్యూస్ తాజాగా ఒకటి వైరల్ అవుతోంది. కాకపోతే ఇది క్రికెట్(Cricket) క్రీడకు సంబంధించి కావడం గమనార్హం. చెప్పాలంటే ఈ ఏడాది ఎంతోమంది క్రికెటర్లు(Cricketers) ఎన్నో రికార్డుల(Records)తో అభిమానుల(Fans)ను అలరించారు. ముఖ్యంగా టీమ్ఇండియా(Team India) T20 ప్రపంచకప్ గెలిచి భారత అభిమానులను సంబరాల్లో ముంచెత్తారు. అయితే ఆ టోర్నీ ముగింపులోనే భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) టీ20లకు వీడ్కోలు పలికారు. ఇలా 2024లో చాలా మంది క్రికెటర్లు ఆటకు పాక్షికంగా లేదా, పూర్తిగా వీడ్కోలు పలికారు. వారిలో ఉంది ఉన్నది వీరే..

అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన క్రికెటర్లలో డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్(David Warner), సౌరభ్ తివారీ, వరుణ్ అరోన్, నీల్ వాగ్నర్, కొలిన్ మున్రో, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, డేవిడ్ వీస్, జేమ్స్ అండర్సన్, శిఖర్ ధవన్(Shikar Dhavan), డేవిడ్ మలాన్, విల్ పుకోవ్స్కీ, బరిందర్ శ్రాన్, మోయిన్ అలీ, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, సిద్ధార్థ్ కౌల్, టిమ్ సౌథీ, ఇమాద్ వసీం, మహ్మద్ ఆమీర్, రవిచంద్రన్ అశ్విన్‌(Ravi Chandran Ashwin)తోపాటు పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ మూడు ఫార్మాట్ల కు వీడ్కోలు పలికాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ టెస్టులకు, షకీబ్ అల్ హాసన్ టెస్టు, టీ20, మహ్మదుల్లా టీ20లకు గుడ్ బై చెప్పారు.

తాజాగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravi Chandran Ashwin) తన మొదటి వన్డే మ్యాచ్ శ్రీలంక(SL)తో 2010 జూన్ 5 ఆడాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు తీయడంతో పాటు 707 పరుగులు చేశాడు.ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్ 2011, నవంబర్ 6న వెస్టీండిస్‌(WI)పై ఆడాడు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టాడు. 3,503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 65 టీ20 మ్యాచ్ ల్లో 72 వికెట్లు తీయడంతో పాటు 184 పరుగులు చేశాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *