Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు(Holidays), వారాంతపు సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారి సర్వదర్శనం కోసం వచ్చిన టోకెన్లు(Tokens) లేని భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

 

ఇక‌, శ‌నివారం 87,347 మంది స్వామివారిని ద‌ర్శించుకున్నారు. 39,490 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వ‌చ్చింద‌ని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు. కాగా, ఇవాళ తెల్ల‌వారుజామున భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల‌కు వ‌చ్చారు. శ్రీవారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

రేపు ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను TTD రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 24న ఉదయం 10 గంటలకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను విడుదల చేయనుంది. జులై నెల శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ టికెట్లు మే 29న ఉదయం 10 గంటలకు రిలీజ్ కానున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *