Theatres Bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. ఎందుకో తెలుసా?

డిస్ట్రిబ్యూటర్లకు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు(Cinema Exhibitors) షాకిచ్చారు. రెంటల్ బేసిస్‌లో మూవీలు రన్ చేయకపోవడంతో జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌ (Theatre Bandh) చేయాలని నిర్ణయించారు. ఇకపై తమకు పర్సంటేజ్(Percentage) రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌(Telugu Film Chamber)లో ఇవాళ నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు(Dil Raju), సురేశ్‌బాబు(Suresh Babu) సహా 60 మంది ఎగ్జిబిటర్లు సమావేశమై సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

చాలా కాలంగా చర్చలు

కాగా ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్ల(Distributors)కు మధ్య పర్సంటేజీలపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యంకాదని ఎగ్జిబిటర్లు అంటుంటే.. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతల(Producers)కు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు.

ఈ మూవీలకు చిక్కులు తప్పవా?

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్‌ చేయాలన్న ఎగ్జిబిటర్లతో పలు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మే 30న భైరవం, జూన్5న కమల హాసన్ నటించిన థగ్ లైఫ్(Thug Life), జూన్ 12న పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu), జూన్ 27న మంచు విష్ణు మూవీ కన్నప్ప(Kannappa), జూన్ 20న కుబేర్, జులైలో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్(Kingdom) సినిమాతోపాటు పలు చిన్న చిత్రాలు కూడా విడుదల కావాల్సి ఉంది. దీంతో ఆయా మూవీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *