ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు(Cashless Transactions) గణనీయంగా పెరిగిన నేపథ్యంలో యూపీఐ యాప్(UPI Apps)ల వినియోగదారుల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ముఖ్యంగా, తమ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు(Bank Account Balance) ఉందో తెలుసుకోవడానికి చాలామంది తరచూ UPI యాప్లనే ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల బ్యాంకు శాఖకు గానీ, ATM కేంద్రానికి గానీ వెళ్లాల్సిన అవసరం తప్పుతోంది. అయితే, ఇలా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని కొత్త నిబంధనలు(Rules) తీసుకురానుంది. ఈ మేరకు బ్యాంకులకు, యూపీఐ సేవల సంస్థలకు ఇప్పటికే నోటిఫికేషన్(Notification) జారీ చేసింది.
![]()
గరిష్ఠంగా రోజుకు 50 సార్లు మాత్రమే..
NPCI కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఒక UPI App ద్వారా గరిష్ఠంగా రోజుకు 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ ఖాతాలోని నిల్వను పరిశీలించుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ వినియోగదారులు(Customers) రెండు వేర్వేరు యూపీఐ యాప్లు వాడుతున్నట్లయితే, ప్రతి యాప్లోనూ రోజుకు 50 సార్లు చొప్పున బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. యూపీఐ నెట్వర్క్(UPI Network)పై అధిక భారం పడకుండా చూడటం, తద్వారా లావాదేవీల వేగాన్ని, సేవల నాణ్యతను పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని NPCI వర్గాలు తెలిపాయి. కాగా ఈ కొత్త రూల్స్ ఆగస్టు 1 నుంచి అమలు కానున్నాయి.






