Kannappa: నా కల నెరవేరింది.. ఈ చిత్రం ప్రేక్షకులకు అంకితం: మంచు విష్ణు

Kannappa: నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్(Dream Project) అయిన ‘కన్నప్ప(Kannappa)’ మూవీ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విష్ణు తీవ్ర భావోద్వేగాని(Emotional)కి లోనయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ క్షణం రానే వచ్చిందంటూ సోషల్ మీడియా(Social Media) వేదికగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ మూవీపై వస్తున్న స్పందన పట్ల ఆయన అభిమానుల(Fans)కు కృతజ్ఞతలు తెలిపారు.

నా సినిమా మాత్రమే కాదు. ఇది ఇప్పుడు మీ అందరిది

ఈ సందర్భంగా మంచు విష్ణు ‘ఎక్స్(X)’ లో ఒక పోస్ట్ చేశారు. “ఈ క్షణం కోసం నా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాను” అంటూ తన ట్వీట్‌(Tweet)ను ఎంతో ఉద్వేగభరితంగా ప్రారంభించారు. కాగా ఇండియాలో మార్నింగ్ షో, విదేశాల్లోని ప్రీమియర్ షో(Premiere shows)ల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, ప్రేమ తన హృదయాన్ని కృతజ్ఞతతో నింపేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అంకితమిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కన్నప్ప’ ఇకపై కేవలం నా సినిమా మాత్రమే కాదు. ఇది ఇప్పుడు మీ అందరిది అని విష్ణు తన పోస్టులో పేర్కొన్నారు. చివరగా “#హర్‌హర్‌మహాదేవ్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన పోస్టును ముగించారు.

పూర్తి మైథలాజికల్ చిత్రంగా..

పూర్తి మైథలాజికల్ చిత్రంగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కించిన ఈ మూవీలో మంచు విష్ణు, ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్(Mohan lal), మోహన్ బాబు(Mohan Babu), ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, నయనతార(Nayanatara), అసితా అనోలా రోడ్రిగ్స్ తదితర స్టార్ నటీనటులు నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్(Avram Manchu) సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయింది. అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ‘కన్నప్ప’ సూపర్ అంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *