APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అమరావతి రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 194/7 స్కోర్ సాధించగా, తుంగభద్ర వారియర్స్ కేవలం 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్ రూ.35 లక్షల నగదు బహుమతిని అందుకోగా, రన్నరప్‌గా నిలిచిన అమరావతి రాయల్స్‌కు రూ.20 లక్షలు దక్కాయి.

ఛేదనలో వారిద్దరే కొట్టేశారు..

కాగా తుంగభద్ర వారియర్స్ విజయంలో మిడిలార్డర్ బ్యాటర్లు గుట్టా రోహిత్(Gutta Rohit), సీఆర్ జ్ఞానేశ్వర్ (CR Gyaneshwar) కీలక పాత్ర పోషించారు. రోహిత్ 28 బంతుల్లో 63 (3 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు, జ్ఞానేశ్వర్ 45 బంతుల్లో 66 (8 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ చేసి జట్టును విజయతీరంలో నడిపించారు. దత్తరెడ్డి(25) కూడా కీలక ఇన్నింగ్స్‌తో రాణించాడు. అంతకుముందు అమరావతి రాయల్స్ కెప్టెన్ హనుమ విహారి(51) అర్ధ సెంచరీ, రెండు వికెట్లతో పోరాడినప్పటికీ, ఫలితం రాయల్స్‌కు అనుకూలంగా రాలేదు.

Image

ఆకట్టుకున్న టీడబ్ల్యూ కెప్టెన్ మహీప్ కుమార్ కెప్టెన్సీ

కాగా ఈ మ్యాచులో రాణించిన రోహిత్‌కు ‘Man of the Match’ అవార్డు దక్కగా.. సిరీస్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 299 రన్స్‌తో అద్భుతంగా రాణించిన విహారి(Hanuma Vihari)కి ‘Player of the Season’ అవార్డు లభించింది. కాగా క్వాలిఫయర్ 2లో భీమవరం బుల్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరిన తుంగభద్ర వారియర్స్, లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి తమ సత్తా చాటింది. కెప్టెన్ మహీప్ కుమార్(Maheep Kumar) నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో APL 2025 సీజన్‌లో తుంగభద్ర వారియర్స్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అభిమానులకు మరపురాని క్షణాలను అందించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *