Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి

తెలంగాణలోని యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కార్పియో కారు అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీ(Andhra pradesh)కి చెందిన డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావుగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్‌, డ్రైవర్‌ నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. నర్సింగరావును ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Road Accident: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు డీఎస్పీలు మృతి | Two DSPs died  in Road Accident near Kauthapuram in Choutuppal mandal kjr spl

కాగా మృతులిద్దరూ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌(AP Intelligence and Security Wing)లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఓ కేసు(Case) విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత(AP Home Minister Anitha) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Kalthi Kallu Incident: కల్తీ కల్లు ఘటన.. 44కి చేరిన బాధితుల సంఖ్య

హైదరాబాద్‌(Hyderabad)లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరగా, ఇప్పటివరకు ఆరుగురు మృతి(Six Died) చెందినట్లు తెలుస్తోంది. మృతులు స్వరూప (56), తులసిరామ్ (47), బొజ్జయ్య (55),…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *