జమ్మూ కశ్మీర్ లో ఇద్దరు పోలీసుల అనుమానాస్పద మృతి

జమ్మూ కశ్మీర్ లో (Jammu and Kashmir) ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఉదంపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా దీన్ని అనుమానాస్పద మృతి గా భావిస్తున్నారు. ఉదయం 6.30 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని కాళీ మాత ఆలయం (kali matha temple) వెలుపల పోలీసు వ్యానులో బుల్లెట్లు శరీరంలోకి వెళ్లిన డెడ్ బాడీస్ కనిపించాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను పోస్టు మార్టానికి తరలించారు. కాగా ఇందులో టెర్రర్ ఎటాక్ ఎలాంటిది లేదని కేవలం ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుని మరణించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని జమ్మూ కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు.

పరస్పరం కాల్చుకుని..

ఎన్ఎస్ పీ ఉదంపూర్ (udhampur) ఆమోద్ నాగ్ ఫురే మాట్లాడుతూ.. ఉదంపూర్ కాళీమాత టెంపుల్ రహమ్ బాల్ ప్రాంతంలో పోలీసులు ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారన్నారు. ఈ ఘటనలో ఏకే 47 రైఫిల్ (ak 47) ఉపయోగించినట్లు రుజువైందన్నారు. అక్కడే ఉన్న మరో పోలీసు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. మూడో వ్యక్తి సురక్షితంగా ఉండటంతో ఇది కేవలం ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ అని తెలుస్తుందన్నారు. అయితే వీరిద్దరు పరస్పరం కాల్చుకుని చనిపోవడానికి గల కారణాలు ఏమిటనే విషయం ఇంకా తెలియలేదు. ఇద్దరి మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేక పాత గొడవలతో ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డారా అనేది విచారణలో తేలనుంది. జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ (udham pur) చాలా సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ఇద్దరు పోలీసులకు ఇలా చేసుకోవడంతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. వీరి మృతికి గల కారణాల గురించి అన్వేషిస్తున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *