AADHAR UPDATE: ఆధార్ కార్డ్ హోల్డర్స్‌కి మరో ఛాన్స్.. అప్డేషన్ గుడువు మళ్లీ పెంపు!

ఆధార్ అప్‌డేట్(Aadhar Update) చేసుకోని వారికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు నిన్నటితో ముగిసిన ఉచిత అప్‌డేట్ గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు జూన్ 14, 2025తో ముగియాల్సిన ఈ అవకాశాన్ని 2026 జూన్ 14 వరకు పెంచినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది ఆధార్ హోల్డర్లకు లాభం చేకూరనుంది. వివాహం, ఉద్యోగ మార్పులు, విద్యా లక్ష్యాలు వంటి కారణాలతో చిరునామా మారినవారు, అలాగే ఆధార్ తీసుకున్నప్పటి నుంచి 10 ఏళ్లు గడిచినవారు తమ వివరాలను మార్చుకోవడానికి ఇది చక్కటి అవకాశం కానుంది.

ఈ ధ్రువపత్రాలు ఉంటే చాలు..

ఆధార్ కార్డు హోల్డర్స్ అప్డేషన్ కోసం లేటెస్ట్‌ గుర్తింపు కార్డు(Latest identity card), చిరునామా వివరాలను సమర్పించాలి. రేషన్‌ కార్డు, Voter ID, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వాడుకోవచ్చు. TC, మార్క్‌షీట్‌, పాన్‌/E-PAN, డ్రైవింగ్‌ లైసెన్సు వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని UIDAI తెలిపింది.

ఆన్‌లైన్‌లో ఎలా అప్ డేట్ చేయాలంటే..

ఆన్‌లైన్‌లో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ చేయాలంటే ముందుగా UIDAI వెబ్‌సైట్‌ https://uidai.gov.in/లో ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి.
రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు OTPతో లాగిన్‌ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
అందులోని వివరాలన్నీ సరైనవో కాదో చెక్‌ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.
తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి.
14 అంకెల ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *