వల్లభనేని వంశీకి మరో షాక్‌.. ఈనెల 22 వరకు రిమాండ్ పొడిగింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌(Vallabhaneni Vamsi )కు మరో షాక్‌ తగిలింది. వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు వెల్లడించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే తాజాగా కోర్టు వంశీకి ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది.

22వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు

ఈ కేసులో వల్లభనేని వంశీతో సహా ఐదుగురు నిందితులకు రిమాండ్ (Vallabhaneni Vamsi Remand) ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో వంశీ ప్రధాన అనుచరుడు రంగాపై పీటీ వారెంట్ దాఖలు చేయగా.. అతడికి కూడా ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. కాగా, సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో.. ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్‌ తర్వాత.. వంశీపై మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *