క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం

ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాంబ్లీ రమాకాంత్ అచ్రేకర్ (Ramakant Achrekar) మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా.. సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar), అతని వద్దకు వచ్చి కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో కాంబ్లీ 17 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. 21 ఇన్నింగ్స్ ల్లో 54.20 సగటుతో, 59.46 స్ట్రైక్ రేట్ 1084 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ సెంచరీలు, 4 సెంచరీలు సాధించాడు. టెస్టులో అతని అత్యధిక స్కోరు 227 పరుగులు. జనవరి 1993లో ఇంగ్లండ్ పై కాంబ్లీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అక్టోబర్ 1991లో పాకిస్థాన్ పై వినోద్ కాంబ్లీ (Vinod Kambli) వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 105 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 97 ఇన్సింగ్స్ లతో 2477 పరుగులు చేశాడు. వన్డేల్లో కాంబ్లీ సగటు 32.59, స్ట్రైక్ రేట్ 71.94. ఈ ఫార్మాట్లో 14 అర్ధసెంచరీలతో పాటు 2 సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 106 పరుగులు చేశాడు. కాగా 1996 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా, శ్రీలంక ఆడగా అందులో వినోద్ కాంబ్లీ ఫెయిల్ కావడంతో అతడి క్రికెట్ కెరీర్ ముగిసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటర్లు అందరూ తొందరగా అవుట్ కావడంతో ప్రేక్షకులు స్టేడియంలోనే నిరసన వ్యక్తం చేసి బాటిళ్లు విసిరేస్తారు. చైర్లకు నిప్పులు పెడతారు. దీంతో మ్యాచ్ రద్దవుతుంది. అనంతరం క్రికెట్ జట్టులోకి మళ్లీ సెలెక్ట్ కాకపోవడంతో వినోద్ కాంబ్లీ కెరీర్ ముగిసింది.

తాజాగా వినోద్ కాంబ్లీ వీడియో బయటకు రాాగానే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఆయనకు గుండె సంబంధిత సమస్యలతో పాటు అనేక ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు. కాగా ఆయన ఆరోగ్యం ఆయన ఆరోగ్యం క్షీణించింది. తాజాగా.. మరోసారి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు ఎలాంటి అధికారిక సమాచారం తెలపడం లేదు. కాంబ్లీ.. ఇటీవల పునరావాస కేంద్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మాజీ క్రికెటర్లు కూడా కాంబ్లీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కపిల్ దేవ్ (Kapil Dev) నుండి సునీల్ గవాస్కర్ వరకు అతనికి సహాయం చేయడం గురించి మాట్లాడారు.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *