Virat Kohli: రిటైర్మెంట్కు, గడ్డానికి లింక్ పెట్టిన కోహ్లీ.. ఏమన్నాడంటే?

విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇది పేరు కాదు బ్రాండ్. తన క్రికెట్ మాయాజాలంతో భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. 17 సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరించిన కోహ్లీ.. గతంలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఈ ఏడాది మేలో టెస్ట్ క్రికెట్కు సైతం గుడ్బై చెప్పాడు. అయితే టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు. ఎట్టకేలకు ఈ విషయంపై మాట్లాడారు. తన రిటైర్‌మెంట్‌కు నెరిసిన గడ్డంతో ముడిపెట్టాడు.

మన టైమ్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి

మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) లండన్‌లో నిర్వహించిన ఓ చారిటీ కార్యక్రమానికి హాజరైన కోహ్లీ రిటైర్‌మెంట్ గురించి మాట్లాడారు. తన వయసును ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని రిటైర్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే వయసు మీద పడుతోందనే అంశాన్ని నేరుగా చెప్పకుండా గడ్డానికి రంగు వేసుకుంటున్నానంటూ జోక్ చేశాడు. ‘గడ్డానికి రెండు రోజుల క్రితమే కలర్ వేశా. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి కలర్ వేసుకుంటున్నామంటే మన టైమ్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నాడు.

యువీ కోసమే వచ్చా.. 

నాడు యువరాజ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌తో కలసి ఆడిన రోజుల్ని గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. టీమిండియాలో స్థానాన్ని పదిలం చేసుకునేందుకు వీరంతా సాయపడ్డారని తెలిపాడు. గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా తాము చాలా క్లోజ్‌గా ఉంటామని పేర్కొన్నాడు. ‘టీమిండియాకు వచ్చిన కొత్తలో కాస్త భయం, బెరుకు ఉండేవి. కానీ యువీ, జహీర్, భజ్జీ నాకు అండగా నిలిచారు. యువరాజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను ఎంతో గౌరవిస్తా. యువీ కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చా. మరొకరు పిలిస్తే వచ్చేవాడిని కాదు’ అని యువరాజ్ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *