Virat Kohli’s Pub: కోహ్లీ పబ్‌కు నోటీసులు.. ఎందుకో తెలుసా?

టీమ్ఇండియా(Team India) స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి బెంగళూరు నగరపాలిక అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు బెంగళూరులో కోహ్లీకి ‘వన్8 కమ్యూన్(One8 Commune)’ అనే పబ్‌ ఉంది. ఈ పబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనల(Fire Safety Regulations) ఉల్లంఘన జరిగిందంటూ బెంగళూరు బృహత్‌ మహానగర పాలిక (Bruhat Bengaluru Mahanagara Palike) నోటీసులు(Notice) ఇష్యూ చేసింది. నగరంలోని చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి(MCA) సమీపంలో ఉన్న MG రోడ్డులోని రత్నం కాంప్లెక్స్‌లో ఈ పబ్ ఉంది. ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(No Objection Certificate)’ తీసుకోకుండానే ఈ పబ్‌ను నిర్వహిస్తున్నారని BBMP పేర్కొంది.

గతంలోనూ ఓసారి నోటీసులు..

దీనిపై సామాజిక కార్యకర్తలు HM వెంకటేశ్, కుణిగల్‌ నరసింహమూర్తి అనే వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో BBMP ఈ నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 29న నోటీసులు జారీ చేసింది. కానీ, ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశామని, 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే పబ్‌(PUB)పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీకి చెందిన శాంతినగర్ డివిజన్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.

అర్ధరాత్రి దాటాక పబ్ నిర్వహణ

కాగా, జులైలో కూడా ‘వన్8 కమ్యూన్‌’ పబ్‌పై ఒక కేసు నమోదయింది. అర్ధరాత్రి దాటాక 1 గంట వరకు నడిపించడంతో పోలీసులు FIR నమోదు చేశారు. అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు నిర్వహించారని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా IPLలో కోహ్లీ బెంగళూరు ఫ్రాంచైజీ(RCB)కి చాలా ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ విరాట్ పబ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కోహ్లీ BGT 2024-25 కోసం ఆసీస్ పర్యటనలో ఉన్నాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *