Vontimitta: కన్నులపండువగా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం

ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం(Vontimitta Kodandarama Kalyanam) కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, TTD ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. వేదిక ముందుభాగంలో VVIP గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు వేశారు. కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు(Pattu Vastralu), ముత్యాల తలంబ్రాలు(Muthyala Thalambralu) సమర్పించారు. రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలు, దేశవిదేశాల్లో లభించే అరుదైన పుష్పాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

అంతకుముందు CM చంద్రబాబుకు ఆలయ వర్గాలు, TTD చైర్మన్ BR నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారుల స్వాగతం పలికారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేశారు. ఆలయ వేదపండితులు సీఎంకు తలపాగా చుట్టారు. సీతారాముల పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని చంద్రబాబు దంపతులు ఆలయ ప్రదక్షిణలు చేశారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం చంద్రబాబు దంపతులకు అర్చక స్వాములు వేదాశీర్వచనం పలికి అక్షింతలు చల్లారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా రాముడు, సీత, లక్ష్మణుడితో కూడిన చిత్రపటాన్ని సీఎం దంపతులకు బహూకరించారు. ఈ కార్యక్రమాలు ముగిశాక చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కోదండ రాముడి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు.

23 భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు

కాగా శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి జరుగతున్న ఈ కళ్యాణాన్ని కార్యక్రామాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయానికి సమీపంలో కల్యాణవేదిక ప్రాంతంలో 23 భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. కళ్యాణం అనంతరం టీటీడీ అధికారులు భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *