VV Vinayak: వివి వినాయక్ అనారోగ్యం.. క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్

ఒకప్పుడు మాస్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్.. దిల్, ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్ కృష్ణ, అల్లుడు శీను వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించి ట్రెండ్ సెట్ చేశాడు. కానీ కొంత కాలంగా ఆయన పేరే వినిపించడం లేదు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ మూవీలను అందించిన ఆ స్టార్ డైరెక్టరే వివి వినాయక్(VV Vinayak). కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన హెల్త్(Health) బాగోలేదని, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గత రెండ్రోజులుగా సోషల్ మీడియా(SM)లో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. దీంతో ఆయన పీఆర్ టీమ్ తాజాగా స్పందించింది.

‘‘ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం(Health)పై వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. సోషల్ మీడియాలో వ్యూస్(Views) కోసం తప్పుడు వార్తలు సృష్టించొద్దు. వాస్తవాలు తెలుసుకొని రాయడం మంచింది. తప్పుడు రూమర్లను ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో వివి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సరైన సక్సెస్ లేకపోవడంతోనే..

కాగా టాలీవుడ్‌(Tollywood)లో మాస్ డైరెక్టర్‌గా వివి వినాయక్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో ఈ సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ సొంతం చేసుకున్నాయి. అయితే ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేక ఆయన వెనుకబడిపోయారు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి బెల్లంకొండ శ్రీనివాస్‌(Bellamkonda Srinivas)తో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌(‘Chhatrapati’ Hindi remake)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయితే ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *