భార్యల చేతిలో భర్తల చావులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులు తట్టుకోలేక కొందరు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మరికొందరు.. ఇలా వివిధ కారణాలతో భర్తను భార్య హతమారుస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కొందరైతే కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ముల్లో కుక్కేస్తున్నారు. ఇలాంటి గగుర్పొడిచే ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వేర్వేరుగా వివాహేతర సంబంధాలు
వేర్వేరుగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న భార్యాభర్తలు 15 ఏళ్లుగా ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నేళ్ల నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అయినా సరే భర్త తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ తన భర్తను ఎలాగైనా మట్టుపెట్టాలని ప్లాన్ వేసింది. కొన్ని రోజులుగా ప్రణాళిక వేసి ఎట్టకేలకు హతమార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం తన చెల్లెలి సాయం తీసుకుంది. అలా భర్తకు ఓ రోజు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చింది. అనంతరం పూడ్చిపెట్టింది.
వివరాల్లోకి వెళ్తే
హైదరాబాద్ కేపీహెచ్బీకి చెందిన దంపతులు సాయిలు, కవిత పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత వేర్వేరు వ్యక్తులతో ఇద్దరు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. 15 ఏళ్ల తర్వాత ఇద్దరికి ఓ భయంకరమైన వ్యాధి సోకింది. అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారు. వేర్వేరుగా ఉంటున్నా సరే.. సాయిలు తరచూ కవితను వేధిస్తూ ఉండేవాడు. దీంతో విసిగిపోయిన కవిత సాయిలు వేధింపుల నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని భావించింది.
అతడు చనిపోతేనే తనకు మనశ్శాంతి కలుగుతుందని భావించి చెల్లెలి భర్త సాయంతో సాయిల్ కు కరెంటు షాక్ పెట్టి చంపి పూడ్చిపెట్టింది. అయితే సొంతూరుకు వెళ్లి కొన్ని రోజుల నుంచి సాయిలు తిరిగి రాలేదని కవిత ఇరుగుపొరుకు చెప్పింది. దీంతో వారు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ శైలిలో విచారించగా కవిత అసలు విషయం చెప్పేసింది.






