కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్తను హత్య చేయించిన భార్య

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ (indoor) నుంచి మేఘాలయాకు హనీమూన్ కు వెళ్లిన జంట అదృశ్యం కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను హనీమూన్ లో ఉండగానే భార్య, మరో ముగ్గురితో కలిసి చంపి లోయలో పడేసినట్లు తేలింది. హనీమూన్‌ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయారు. భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కాగా.. భార్య మాత్రం కనిపించకుండా పోయింది. చివరకు రఘువంశీ భార్య సోనమ్ ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు.

అసలు ఎలా జరిగిందంటే.. 

మే 11న సోనమ్ తో రాజా రఘువంశీకి వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయాకు (megalaya) నవ దంపతులు వెళ్లారు. 22 తేదీన ఒక బైక్ అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడి ఫేమస్ ప్రాంతామైన ‘లివింగ్ రూట్ వంతెన’ చూసేందుకు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి ఆచూకీ తెలియలేదు. కాగా 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ డెడ్ బాడీని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోతైన లోయలో గుర్తించారు. అతడి డెడ్ బాడీపై కత్తిపోట్లు ఉండటం, భార్య కనిపించకుండా పోవడంతో హత్యగా భావించి పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.

కాంట్రాక్ట్ కిల్లర్లతో సుపారీ..

ఈ క్రమంలో సోనమ్‌ తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో (gajipur) పోలీసుల ఎదుట లొంగిపోయింది. మేఘాలయా డీజీపీ ఆమెను అరెస్టు చేసి విచారించగా భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాంట్రాక్ట్‌ కిల్లర్లకు సుపారీ ఇచ్చి తన భర్త రఘువంశీని సోనమ్ చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రఘువంశీని చంపేందుకు భార్య సోనమ్ సుపారీ ఇచ్చినట్లు ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు. కేసు విచారణ కొనసాగుతుందని మరిన్ని వివరాలు విచారణ అనంతరం చెబుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 7 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను మేఘాలయా సీఎం అభినందించారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *