భారత యువ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరోసారి అదరగొట్టాడు. ప్రత్యర్థి ఎవరైనా తన దూకుడుతో వారిపై పైచేయి సాధించే యశస్వి బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border-Gavaskar Trophy) ఆస్ట్రేలియాపై సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్లో సెంచరీ చేశాడు. మరో 61 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఈ యువ బ్యాటర్ కెరీర్లో ఇది నాలుగో సెంచరీ. ఈ క్రమంలోనే అతడు పలు రికార్టులను తన పేరిట రాసుకున్నాడు.
యశస్వి సాధించిన ఘనతలివి..
* ఆస్ట్రేలియాతో ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో బ్యాటర్గా యశస్వి (Yashasvi Jaiswal) రికార్డు.
* ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్గా మరో ఘనత. 22 ఏండ్ల 330 రోజుల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు. యశస్వి కంటే ముందు కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు), జైసింహా (1967–78), సునీల్ గవాస్కర్ (1977–78) ఉన్నారు. వీరంతా రెండో ఇన్నింగ్స్ లోనే సెంచరీ బాదడం విశేషం.
* మొదటి 15 టెస్టుల్లో 1500+ రన్స్ చేసిన తొలి బ్యాటర్గా రికార్టు. ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 1500+ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా జైస్వాల్ రికార్టు. అంతకుముందు పుజారా కూడా 28 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు.
* భారత్ తరఫున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో బ్యాటర్ యశస్వి.
* ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై చివరిసారిగా సెంచరీ సాధించిన ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (2014–15 సీజన్లో). ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జైస్వాల్ సెంచరీ బాదాడు.
భారత్ దూకుడు
బోర్డర్–గవాస్కర్ ట్రోపీని భారత్ పేలవంగా ప్రారంభించినప్పటికీ.. ఆపై ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న టీంమిండియా.. కేవలం 150 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఆస్ట్రేలియా (Australia) బారత బౌలర్లు చుక్కలు చూపించారు. బుమ్రా, సిరాజ్, హర్షిత రాణా దెబ్బకు ఆ జట్టు క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 104 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్సింగ్ ప్రారంభించిన టీంఇండియా భారీ ఆధిక్యాన్ని సాధించేలా దూసుకెళుతోంది. జైస్వాల్ 161, కేఎల్ రాహుల్ 77 రన్స్తో సత్తా చాటారు. ఇప్పటికే 350+ రన్స్ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ ఉన్నారు.








