Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. వైసీపీ ఎంపీ అరెస్టు

ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YCP MP Mithun Reddy)ని సిట్(SIT) అధికారులు నేడు (జులై 19) అరెస్ట్ చేశారు. APలో కూటమి ప్రభుత్వం వచ్చాక, లిక్కర్ స్కాంపై దర్యాప్తు ఆరంభం కాగా, ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్(Arrest) తో ఈ కేసు కీలక మలుపు తిరిగినట్టయింది. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. వివాదాస్పద మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు సిట్ గుర్తించింది. ఈ మేరకు మిథున్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆయనను 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు మరింత సమాచారం సేకరించడం కోసం అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సిట్ వర్గాలు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాయి.

AP Liquor Scam: మిథున్‌రెడ్డిపై లుక్అవుట్ సర్క్యులర్‌ జారీ... విదేశాలకు  వెళ్లకుండా ముందస్తు చర్యలు - Telugu News | Sit look out notice issued to  ycp mp mithun reddy in ap liquor scam ...

ముందస్తు బెయిల్ తిరస్కరించిన హైకోర్టు, సుప్రీంకోర్టు

అంతకుముందు మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా, సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. దాంతో ఆయన అరెస్ట్‌కు మార్గం సుగమమైంది. కాగా, లిక్కర్ స్కాంలో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ2గా వాసుదేవరెడ్డి, ఏ3గా సత్యప్రసాద్ ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ కేసులో ఏ5 అని తెలిసిందే. విజయసాయి ఈ కుంభకోణంలో తనను తాను విజిల్ బ్లోయర్ ను అని చెప్పుకుంటున్నప్పటికీ, ఈ కేసులో ఆయన పాత్రపై ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా పొందుపరిచినట్టు తెలుస్తోంది.

మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం: విడుదల రజిని

ఇదిలా ఉండగా మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని అభివర్ణించారు. అధికారం ఉంది కదా అని, లేని లిక్కర్ కేసును సృష్టించి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. “మా ఎంపీ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నా. చంద్రబాబు గారూ… అధికారం శాశ్వతం కాదన్నది గుర్తుపెట్టుకోండి” అంటూ రజిని ట్వీట్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *