Virgin Boys: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ‘వర్జిన్ బాయ్స్’ ఓటీటీ డేట్ లాక్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తెలుగు చిత్రం ‘వర్జిన్ బాయ్స్(Virgin Boys)’ ఓటీటీలోకి వచ్చేసింది. గీతానంద్(Geetanand), మిత్రా శర్మ(Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దయానంద్ గడ్డం(Dayanand Gaddam) దర్శకత్వం వహించారు. రాజ్ గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజా దారపునేని(Raja Darapuneni) నిర్మించిన ఈ సినిమా జులై 11న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా(Aha)లో స్ట్రీమింగ్ కానుంది.‘వర్జిన్ బాయ్స్’ కథలో ఆర్య (గీతానంద్), డుండీ (శ్రీహాన్), రోనీ (రోనిత్) అనే ముగ్గురు బీటెక్ విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది. వీరు తమ వర్జినిటీ కోల్పోవాలనే ఛాలెంజ్‌ను స్వీకరిస్తారు. ఈ క్రమంలో సరయు (మిత్రా శర్మ), లైలా (జెన్నీఫర్ ఇమాన్యుయల్), శ్లోక (అన్షులా ధావన్)లతో వీరి ప్రేమ కథలు మొదలవుతాయి.

Virgin Boys: మిత్రాశ‌ర్మ.. పెద‌వుల త‌డి రొమాంటిక్ సాంగ్ రిలీజ్‌ | Pedavula  Thadi Video Song out from Mitraaw Sharma Virgin Boys movie ktr

ఆకట్టుకునేలా డబుల్ మీనింగ్ డైలాగులు

ఇక ఈ మూవీలో యూత్‌ను ఆకట్టుకునే డబుల్ మీనింగ్ డైలాగులు, గ్లామర్ సన్నివేశాలతో ఈ చిత్రం అడల్ట్ కామెడీ జోనర్‌(Adult comedy genre)లో ఆకట్టుకుంది. అయితే, చివర్లో ప్రేమ యొక్క నిజమైన విలువను తెలియజేసే సందేశంతో ముగుస్తుంది. స్మరణ్ సాయి(Smaran Sai) సంగీతం, వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. థియేటర్లలో విడుదలైనప్పుడు ‘టికెట్ కొట్టు-ఐఫోన్ పట్టు’, ‘మనీ రైన్’ వంటి వినూత్న ప్రమోషన్‌లతో ఈ సినిమా దృష్టిని ఆకర్షించింది. యూత్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ అదే ఉత్సాహాన్ని అందించనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *