అలా చేస్తే యుద్ధం ముగిస్తాం.. జెలెన్​ స్కీ కీలక వ్యాఖ్యలు

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం (Russia–Ukraine War) ఆగడంలేదు. రెండున్నరేళ్ల సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్​ (Ukraine) కకావికలమైంది. వేలాది మంది చనిపోయారు. లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. ఉక్రెయిన్​ సైనికుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండడంతో ఇక పోరు చేయలేమంటూ వారు చేతులెత్తేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ ​స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ప్రముఖ మీడియా సంస్థ స్కై న్యూస్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్​ స్కీ (Volodymyr Zelensky) మాట్లాడుతూ దేశ రాజధాని కీవ్​ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో (NATO) పరిధిలోకి తీసుకొస్తే యుద్ధాన్ని ముగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్​ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలి. అప్పుడే మేం కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని నాటోలో చేర్చాలి. అలా జరిగితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని అధికారికంగా సాధించుకునే వీలు మాకు లభిస్తుంది’ అని అన్నారు.

సైనిక చర్య పేరుతో 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్​పై రష్యా (Russia) యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ పోరులో ఉక్రెయిన్​కు కోలుకోలేని నష్టం ఏర్పడింది. ఆ దేశానికి భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. కవ్​కు తాము అందించిన క్షిపణులను రష్యాపై వాడుకోవచ్చని అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు బైడెన్​ గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రష్యా.. ఉక్రెయిన్​పై మిస్సైల్స్​తో దాడులు తీవ్రం చేసింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *