తప్పు జరిగింది.. క్షమించండి : పవన్ కల్యాణ్

తిరుపతి తొక్కిసలాట ఘటనపై (Tirupati Stampede Case) డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఏపీ ప్రజలను, తిరుమల భక్తులను క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించండి.. బాధ్యత తీసుకుంటున్నాం.. అంటూ తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.  ఇంత మంది అధికారులున్నా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం సరికాదని పేర్కొన్నారు.

భక్తులను కంట్రోల్ చేయలేరా..

“బాధితులను క్షమించమని వేడుకున్నాం. తప్పు జరిగింది.. బాధ్యత తీసుకుంటాం అని చెప్పాం. ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు. పోలీసులకు క్రౌడ్ మేనేజ్మెంట్ అలవాటు కాలేదు. భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో విఫలమయ్యారు. అధికారుల తప్పులకు మేం తిట్లు తింటున్నాం. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు.. భక్తులను కంట్రోల్ చేయలేరా? ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారు.” అని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

అభిమానులు, పోలీసులపై ఫైర్

మరోవైపు అభిమానులు, పోలీసుల తీరుపై కూడా పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan On Tirupati News) ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ ఫైర్ అయ్యారు.  అధికారుల తీరు కారణంగా సీఎం చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందని ధ్వజమెత్తారు. అధికారులు తక్షణమే మేల్కోవాలని సూచించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *