తిరుమల శ్రీవారిని సేవలో పవన్ సతీమణి అన్నా లెజినోవా

ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan),​ అన్నాలెజినోవాల కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ఇటీవలే సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన కుమారుడిని తీసుకుని పవన్, ఆయన సతీమణి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

తిరుమలలో పవన్ సతీమణి

ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అన్నా లెజినోవా (Anna Lezhneva) శ్రీవారిని దర్శించుకున్నారు.  వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్​ వద్దకు చేరుకోగానే టీటీడీ అధికారి హరింద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

శ్రీవారి సేవలో అన్నా లెజినోవా

దర్శన చేసుకున్న తర్వాత  అన్నాలెజినోవా(Anna Lezhneva Tirumala)కు అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం బయటకు వచ్చిన తర్వాత అఖిలాండం వద్ద కొబ్బరి కాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రానికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత అన్నప్రసాదాలు స్వీకరించనున్నారు.

గుండు చేయించుకున్న అన్నా లెజినోవా

అయితే శ్రీవారి దర్శనార్థం ఆదివారం రోజున తిరుమలకు చేరుకున్న అన్నాలెజినోవా .. గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం వద్దకు చేరుకుని శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా భూవరాహ స్వామివారిని దర్శించుకుని రాత్రి తిరుమలలోనే బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *