Mana Enadu: తెలంగాణలో పాలిటిక్స్(Telanaga Politics) హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకూ కానిస్టేబుళ్లు, బెటాలియన్ కానిస్టేబుల్స్(Constables, Battalion Constables), వారి కుటుంబ సభ్యుల ఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అంతకు ముందు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల(Concerns of Group-1 candidates)తోనూ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు జోరుగా సాగాయి. ఈ విషయంలో చివరకు రేవంత్ సర్కార్(Revanth Govt)దే పై చేయి సాధించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సుప్రీంకోర్టు(Supreme court) కూడా గ్రూప్ పరీక్షలు ప్రారంభమైనందునా తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. ఇక నిన్నటి నుంచి రాష్ట్రంలో పాలిటిక్స్ డైవర్షన్ తీసుకున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్(Congress vs BRS) అన్నట్లు సాగుతున్నాయి.
పొంగులేటి చెప్పిన బాంబుల గురించి… కేటీఆర్ స్పందన.. pic.twitter.com/mDdxfhZbUL
— Prabhakar Venavanka (@Prabhavenavanka) October 25, 2024
దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయ్: మంత్రి
ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy చేసిన హాట్ కామెంట్సే(Hot comments) రాష్ట్రంలో తాజా పరిస్థితులకు నిదర్శనం. రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు(Political bombs) పేలుతాయంటూ మంత్రి పొంగులేటి కామెంట్స్ చేసిన నాటి నుంచి అరెస్టుల అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లతో పాటు ఫోన్ ట్యాపింగ్(Phone tapping) అంశాలపై విచారణలు జరుగుతున్నాయి. ఇందులో ఏదో అంశంపై చర్యలు ఉంటాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే పొలిటికల్ బాంబులు ఎప్పుడు పేలుతాయని మీడియా ప్రశ్నించగా. అయితే.. దీపావళి(Diwali)కి ముందే పేలుతాయని ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ సన్నిహిత వర్గాలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఆ అరెస్ట్ అయ్యే BRS నేత ఎవరు అన్న అంశంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. KTR అరెస్ట్ అవుతారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
హైదరాబాద్లో 144 సెక్షన్
మరోవైపు హైదరాబాద్లో 144సెక్షన్(Section 144) విధిస్తూ సీపీ సీవీ ఆనంద్(Hyd CP CV Anand) సోమవారం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడితే అరెస్ట్ చేస్తామని.. ధర్నాలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్లకు నో పర్మీషన్ అని ప్రకటనలో పేర్కొన్నారు సీపీ. కేవలం ఇందిరాపార్క్ దగ్గర మాత్రమే ధర్నాకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్స్ చేస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. దీపావళి సమయంలో ఈ సెక్షన్ విధించడం ఏంటని పలువురు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ అంశంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ ప్రకటనకు దీపావళి వేడుకలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.






